మున్సి పల్ కమిషనర్, టీపీవో సరెండర్ కు తీర్మానం

మున్సి పల్ కమిషనర్, టీపీవో సరెండర్ కు తీర్మానం
  •     కామారెడ్డి మున్సిపల్ బడ్జెట్​మీటింగ్​లో కౌన్సిలర్ల నిర్ణయం

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి మున్సిపల్​కమిషనర్ రాజేందర్​రెడ్డి, టీపీవో గిరిధర్​ను సరెండర్ చేసేందుకు మున్సిపల్ బడ్జెట్​మీటింగ్​లో కౌన్సిలర్లు ఏకగ్రీవ తీర్మానం చేశారు. మున్సిపల్ చైర్​పర్సన్​ఇప్ప ఉమారాణి అధ్యక్షతన శనివారం బడ్జెట్​మీటింగ్​జరిగింది. బడ్జెట్​చర్చ కంటే ముందు ఆయా వార్డుల్లో సమస్యలపై సభ్యులు ప్రస్తావించారు. ప్రధానంగా శానిటేషన్, నీటి సమస్యలపై అధికారులను ప్రశ్నించారు. సమస్యలను కమిషనర్, టీపీవో పట్టించుకోవడం లేదని పలువురు సభ్యులు ఆరోపించారు. తాను ఫోన్​చేసినా కమిషనర్ స్పందించట్లేదని చైర్​పర్సన్ పేర్కొన్నారు. 

నిర్లక్ష్యం వహిస్తున్న కమిషనర్, టీపీవో సరెండర్​కు సభ్యులు తీర్మానం చేశారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని అడిషనల్​కలెక్టర్​మధుమోహన్​ పేర్కొన్నారు. 2026–26 ఆర్థిక ఏడాదికి బడ్జెట్​ను అమోదించారు. పన్నులు, కిరాయిలు, ప్రభుత్వ గ్రాంట్ల ద్వారా మొత్తం రూ. 7.86 కోట్ల ఆదాయం, రూ.70.85 కోట్ల ఖర్చులకు అమోదం తెలిపారు.