సీడీఎఫ్కు రూ.800 కోట్లు కేటాయింపు : టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

సీడీఎఫ్కు రూ.800 కోట్లు కేటాయింపు : టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
  •     ఎమ్మెల్సీగా వచ్చే ఫండ్​ను నిజామాబాద్​కోసం ఖర్చు చేస్త
  •     టీపీసీసీ చీఫ్​మహేశ్​కుమార్​గౌడ్

నిజామాబాద్, వెలుగు: సీఎం రేవంత్​రెడ్డి నేతృత్వంలో నియోజకవర్గ అభివృద్ధి నిధుల (సీడీఎఫ్) కోసం ప్రభుత్వం రూ.800 కోట్ల బడ్జెట్​కేటాయించిందని టీపీసీసీ చీఫ్​ మహేశ్​కుమార్​గౌడ్​తెలిపారు. ప్రతి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేకి రూ.5 కోట్ల సీడీఎఫ్​లభిస్తుందని, ఆ రకంగా తనకు వచ్చే ఫండ్​మొత్తాన్ని నిజామాబాద్​నగరాభివృద్ధికి ఖర్చు చేస్తానన్నారు. శనివారం నిజామాబాద్​మున్సిపల్​కార్పొరేషన్​వార్షిక బడ్జెట్​మీటింగ్​లో ఎక్స్​అఫీషియో సభ్యుడి హోదాలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత పదేండ్లు పాలించిన బీఆర్ఎస్​రాష్ట్రంపై రూ.8 లక్షల కోట్ల అప్పులు పెట్టిపోయిందన్నారు. 

కాంగ్రెస్​ప్రభుత్వం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూనే ప్రయారిటీ అంశాలకు నిధులు వెచ్చిస్తోందన్నారు. ఉత్తర తెలంగాణలో పెద్ద నగరమైన నిజామాబాద్​కోసం ఎన్ని నిధులైనా ఇవ్వడానికైనా సీఎం రేవంత్​రెడ్డి రెడీగా ఉన్నారని తెలిపారు. పట్టణ మాస్టర్​ప్లాన్​అమలుకు సన్నద్ధం కావాలని అధికారులకు సూచించారు.

రూ.247 కోట్ల బడ్జెట్ ఆమోదం

నిజామాబాద్​మున్సిపల్ కార్పొరేషన్​లో 2026–27కు గాను రూ.247 కోట్లతో బడ్జెట్​ను ఆమోదించారు. అంచనా వేసిన మొత్తం రూ.247 కోట్ల ఆదాయానికి సమానంగా ఖర్చును ఆమోదించారు. మేయర్​ఉమారాణి అధ్యక్షతన నిర్వహించిన బడ్జెట్​ మీటింగ్​లో కలెక్టర్​ ఇలా త్రిపాఠి, అర్బన్​ఎమ్మెల్యే ధన్​పాల్​సూర్యనారాయణ, మున్సిపల్​కమిషనర్​దిలీప్​కుమార్​తదితరులు ఉన్నారు.