ఏడుగురికే టికెట్లు.. కవితకు తెల్వదా: సునీతా రావు

ఏడుగురికే టికెట్లు.. కవితకు తెల్వదా: సునీతా రావు

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్​ పార్టీలో  ఏడుగురు మహిళలకే టికెట్లు ఇచ్చిన విషయం కల్వకుంట్ల కవితకు తెలియదా అని మహిళా కాంగ్రెస్​ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతా రావు ప్రశ్నించారు. మంగళవారం ఆమె గాంధీ భవన్​లో మీడియాతో మాట్లాడారు. 

రేవంత్​ రెడ్డిపై పిచ్చిగా మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చరించారు. మహిళలకు అత్యధిక ప్రాధాన్యాన్నిచ్చింది కాంగ్రెస్​ పార్టీనేనని తెలిపారు. కవితకు చిత్తశుద్ధి ఉంటే బీఆర్ఎస్​లో మహిళల సీట్ల కోసం పోరాటం చేయడానికి కలిసి రావాలన్నారు. 

ఇచ్చిన హామీలడిగితే ప్రభుత్వం పారిపోతున్నది: కాంగ్రెస్ నేత మల్లు రవి

హైదరాబాద్, వెలుగు: ప్రజలకు ఇచ్చిన హామీలడిగితే రాష్ట్ర ప్రభుత్వం పారిపోతున్నదని పీసీసీ సీనియర్​ వైస్​ ప్రెసిడెంట్​ మల్లు రవి విమర్శించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా పాల్గొనే చేవెళ్ల సభలో దళిత డిక్లరేషన్​ ప్రకటిస్తామని వెల్లడించారు. 

ఈ నెల 26న చేవెళ్లలో సభ చేపట్టనున్నట్లు తెలిపారు.  మంగళవారం ఆయన గాంధీభవన్​లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్​ ప్రభుత్వం వస్తే దళితులకు ఏమేం చేస్తామో సభలో చెప్తామని తెలిపారు. ఇప్పటికే ఢిల్లీలో దళిత నాయకులతో ఖర్గే చర్చలు జరిపారని చెప్పారు.