
రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ రాజ్ ఘట్ వద్ద సత్యగ్రహ దీక్షను ప్రారంభించింది. పోలీసుల అనుమతి లేనప్పటికీ దీక్షలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, సీనియర్ నేత జైరాం రమేష్, కేసీ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. దీంతో ఆ ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు. రాజ్ ఘట్ వద్ద 144 సెక్షన్ అమల్లో ఉందని ఇప్పటికే పోలీసులు తెలిపారు.
https://twitter.com/ANI/status/1639852998020014087?cxt=HHwWjoC97aDn9sEtAAAA
మరోవైపు హైదరాబాద్ గాంధీభవన్లోని గాంధీవిగ్రహం ముందు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్రావు ఠాక్రే, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలంతా దీక్ష చేస్తున్నారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు సంఘీభావంగా మార్చి 25న దేశవ్యాప్తంగా గాంధీ విగ్రహాల ఎదుట నిరసన చేపట్టాలని కాంగ్రెస్ పిలుపునిచ్చింది.