ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయండి : పొద్దుటూరి వినయ్ కుమార్రెడ్డి

 ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయండి : పొద్దుటూరి వినయ్ కుమార్రెడ్డి

ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్​ నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ఆర్మూర్​ కాంగ్రెస్​ పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జి పొద్దుటూరి వినయ్​ కుమార్​రెడ్డి జిల్లా ఇన్​చార్జి మంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావును కలిసి కోరారు. ఆదివారం జిల్లా కేంద్రానికి వచ్చిన మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. అనంతరం ఆర్మూర్​నియోజకవర్గ సమస్యలు వివరించి అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని మెమోరండం అందజేశారు. మార్కెట్​ కమిటీ చైర్మన్​ సాయిబాబాగౌడ్, కాంగ్రెస్ నాయకులు అయ్యప్ప శ్రీనివాస్, వెంకట్రామ్​రెడ్డి, భూపేందర్, గిరి, బాబ్జీ, ఫయిమ్ తదితరులు 
పాల్గొన్నారు.