
ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జి పొద్దుటూరి వినయ్ కుమార్రెడ్డి జిల్లా ఇన్చార్జి మంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావును కలిసి కోరారు. ఆదివారం జిల్లా కేంద్రానికి వచ్చిన మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. అనంతరం ఆర్మూర్నియోజకవర్గ సమస్యలు వివరించి అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని మెమోరండం అందజేశారు. మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబాగౌడ్, కాంగ్రెస్ నాయకులు అయ్యప్ప శ్రీనివాస్, వెంకట్రామ్రెడ్డి, భూపేందర్, గిరి, బాబ్జీ, ఫయిమ్ తదితరులు
పాల్గొన్నారు.