రైతుబంధు పైసలు ఇవ్వట్లేదని బ్యాంకు ఎదుట కాంగ్రెస్​ లీడర్ల ధర్నా

రైతుబంధు పైసలు ఇవ్వట్లేదని బ్యాంకు ఎదుట కాంగ్రెస్​ లీడర్ల ధర్నా

జిన్నారం, వెలుగు : రైతుబంధు పథకం కింద రైతుల ఖాతాల్లో జమ అయిన పైసలు బ్యాంకులు ఇవ్వడం లేదని కాంగ్రెస్​ లీడర్లు ఆందోళనకు దిగారు.  శుక్రవారం జిన్నారం మండల కేంద్రంలోని  అంబేద్కర్ విగ్రహం నుంచి గ్రామీణ వికాస్ బ్యాంకు వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం బ్యాంకు ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ రవీందర్ గౌడ్ మాట్లాడుతూ రైతుబంధు డబ్బులను బ్యాంకులు రైతుల అప్పుకు వడ్డీ కింద జమకట్టుకుంటున్నాయని ఆరోపించారు. 

బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు డబ్బులు ఇచ్చినట్లు ఇచ్చి మళ్లీ గుంజుకుంటోందని మండిపడ్డారు. రైతులకు పెట్టుబడి సాయం అని చెప్పి మోసం చేయడం తగదన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు వడ్డే కృష్ణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, వైస్ ఎంపీపీ రంగు రమేశ్, ఎంపీటీసీ జనాభాయి, సత్యనారాయణ, రాజు గౌడ్, రాజగోపాల్ రెడ్డి, రైతులు పాల్గొన్నారు.