రాజస్థాన్‌లో ఎమ్మెల్యేల కొనుగోలు ఏజెంట్‌ వసుంధర రాజే: కాంగ్రెస్‌ ఎమ్మెల్యే

రాజస్థాన్‌లో ఎమ్మెల్యేల కొనుగోలు ఏజెంట్‌ వసుంధర రాజే: కాంగ్రెస్‌ ఎమ్మెల్యే

జైపూర్‌‌: రాజస్థాన్‌లో తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనడంలో మాజీ సీఎం వసుంధర రాజే ఏజెంట్‌గా వ్యవహరించారని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఆరోపించారు. దాదాపు 8 నెలల ముందు నుంచే బేరాలు మొదలుపెట్టారని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్యేలను కొనే కేసులో అరెస్టైన ఒక వ్యక్తి తనను 8 నెలల కిందే కలిసి డీల్‌ మాట్లాడేందుకు ప్రయత్నించారని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాజేంద్ర గూడ చెప్పారు. “ వసుంధర రాజే, ఇతర బీజేపీ నేతలను కలవాలని సంజయ్‌ జైన్‌ నన్ను గతంలోనే అడిగారు” అని గూడ చెప్పారు. అలాంటి ఏజెంట్లు చాలా మంది ఉన్నారని, వాళ్లంతా ఎమ్మెల్యేలతో మాట్లాడటంలో ఫెయిల్‌ అయ్యారని చెప్పారు. అశోక్‌ గెహ్లాట్‌ తరఫున వందకుపైగా ఎమ్మెల్యేలు ఉన్నామని, ఫ్లోర్‌‌ టెస్ట్‌ డిమాండ్‌ చేస్తే గెలవలేరని బీజేపీకి తెలుసు కాబట్టే ఫ్లోర్‌‌ టెస్ట్‌కు డిమాండ్‌ చేయడం లేదని ఎమ్మెల్యే అన్నారు. కాగా.. అశోక్‌ గెహ్లాట్‌కు వసుంధర రాజే హెల్ప్‌ చేస్తున్నారని పలువరు ఆరోపించగా ఇప్పుడు గుడా చేసిన ఈ కామెంట్స్‌ ఒక క్లారిటీని ఇచ్చాయి.