హైదరాబాద్, వెలుగు: తన నియోజక వర్గంలో రాహుల్ భారత్ జోడో యాత్ర ఉందని తనకు సోషల్ మీడియా ద్వారా తెలిసిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఈ విషయంపై గాంధీభవన్ మీటింగ్లో మరింత తెలుసుకుంటానని అన్నారు. సీఎల్పీలో ఆయన సోమవారం మీడియాతో చిట్ చాట్ చేశారు.
తన నియోజకవర్గంలో 30 కిలోమీటర్ల మేర పాదయాత్ర ఉంటుందని, అన్ని వర్గాల ప్రజలు యాత్రలో పాల్గొనేలా చూస్తామని చెప్పారు. అయితే ఓఆర్ఆర్ నుంచి రాహుల్ పాదయాత్ర ఉందని,దాని వల్ల ప్రయోజనం లేదన్నారు. దానికి బదులు శంషాబాద్, రాజేంద్రనగర్, మెహిదీపట్నం, లింగంపల్లి నుంచి సంగారెడ్డికి యాత్ర సాగేలా చేస్తే బాగుంటదన్నారు.