సంగారెడ్డిలో 30 కి.మీ మేర రాహుల్ గాంధీ పాదయాత్ర

సంగారెడ్డిలో 30 కి.మీ మేర రాహుల్ గాంధీ పాదయాత్ర

హైదరాబాద్​, వెలుగు: తన నియోజక వర్గంలో రాహుల్​ భారత్​ జోడో యాత్ర ఉందని తనకు సోషల్​ మీడియా ద్వారా తెలిసిందని కాంగ్రెస్​ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఈ విషయంపై గాంధీభవన్​ మీటింగ్​లో మరింత తెలుసుకుంటానని అన్నారు. సీఎల్పీలో ఆయన సోమవారం మీడియాతో  చిట్ చాట్​ చేశారు.

తన నియోజకవర్గంలో 30 కిలోమీటర్ల మేర పాదయాత్ర ఉంటుందని, అన్ని వర్గాల ప్రజలు యాత్రలో పాల్గొనేలా చూస్తామని చెప్పారు. అయితే ఓఆర్ఆర్​ నుంచి రాహుల్​ పాదయాత్ర ఉందని,దాని వల్ల ప్రయోజనం లేదన్నారు. దానికి బదులు శంషాబాద్, రాజేంద్రనగర్,​ మెహిదీపట్నం, లింగంపల్లి నుంచి సంగారెడ్డికి యాత్ర  సాగేలా చేస్తే  బాగుంటదన్నారు.