కల్లబొల్లి మాటలు చెప్పేటోళ్లొస్తున్నరు :  కాలె యాదయ్య

కల్లబొల్లి మాటలు చెప్పేటోళ్లొస్తున్నరు :  కాలె యాదయ్య

చేవెళ్ల,వెలుగు:  అరవై ఏండ్లు పాలించిన కాంగ్రెస్ ప్రజల అభివృద్ధికి, సంక్షేమానికి చేసిందేమీ లేదని, నేడు కల్లబొల్లి మాటలు చెప్తూ అధికార దాహంతో మళ్లీ వస్తున్నారని చేవెళ్ల బీఆర్ఎస్ అభ్యర్థి కాలె యాదయ్య విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం సెగ్మెంట్ పరిధిలోని నవాబుపేట మండలం ఎల్లకొండ, మైతాబ్ ఖాన్ గూడ, మాదిరెడ్డి పల్లి, గంగ్యాడ, నారేగూడ, పులపల్లి, అక్నాపూర్,అత్తపూర్ గ్రామాల్లో యాదయ్య ప్రజా ఆశీర్వాద యాత్ర చేపట్టారు.

ఈ సందర్భంగా కాలె యాదయ్య మాట్లాడుతూ.. ఇంట్లో వాళ్లు చెబితే ఎమ్మెల్యే అవ్వాలని ఒకరు.. అధికార దాహంతో మనపై పెత్తనం చేయాలని మరొకరు వస్తున్నారని పేర్కొన్నారు. వారు ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు లేరని, ఓట్ల కోసం వస్తున్నారని, ఆలోచించి ఓటేయాలని సూచించారు. దొంగలను నమ్మితే గోస పడతమని, అభివృద్ధి చేసిన తనను మరోమారు ఆశీర్వదించి కారు గుర్తుకు ఓటేసి అసెంబ్లీకి పంపాలని ప్రజలను కోరారు. బీఆర్ఎస్ గెలిస్తే మరిన్ని సంక్షేమ పథకాలు వస్తాయన్నారు.