- కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్రెడ్డి
శంకర్ పల్లి, వెలుగు : చేవెళ్లలో ఎగిరేది కాంగ్రెస్జెండానేనని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి ఎంపీ రంజిత్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం బీడీఎల్చౌరస్తా నుంచి శంకర్పల్లి చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానికంగా నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో రంజిత్రెడ్డి పాల్గొని మాట్లాడారు. కేంద్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. కులాలు, మతాలతో రాజకీయాలు చేసేవారు ఎక్కువ కాలం అధికారంలో ఉండలేరని చెప్పారు.
మరో రెండు వారాలు కార్యకర్తలు అలెర్ట్ గా ఉండాలని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. ఎన్నికలు రాగానే పొలిటికల్టూరిస్టులు వచ్చి వెళ్లిపోతారని, ప్రత్యర్థులను ఉద్దేశించి రంజిత్రెడ్డి వ్యాఖ్యానించారు.ఈ సందర్భంగా శంకర్పల్లి వైస్ ఎంపీపీ ప్రవళ్లిక
పర్వేద ఎంపీటీసీ అనిత కాంగ్రెస్ లో చేరారు. చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ పామెన భీంభరత్, శంకర్ పల్లి మున్సిపల్ వైస్ఛైర్మన్ వెంకట్ రాంరెడ్డి, నాయకులు జనార్దన్రెడ్డి, ఉదయ్మెహన్రెడ్డి, ప్రకాష్గుప్తా, ప్రవీణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.