ధనిక రాష్ట్రాన్ని దివాళా తీయించింది టీఆర్ఎస్సే

ధనిక రాష్ట్రాన్ని దివాళా తీయించింది టీఆర్ఎస్సే

ఉప్పల్: రాష్ట్రాన్ని టీఆర్ఎస్ పార్టీ దివాళా తీయించిందని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి విమర్శించారు. ఉప్పల్‌‌లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జీహెచ్ఎంసీ ఎన్నికల ర్యాలీలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఇరవై ఏళ్ల పాటు శ్రమించి హైదరాబాద్‌‌ను అభివృద్ధి చేసిందన్నారు. ‘అంతర్జాతీయ ఎయిర్‌‌పోర్టు, ఔటర్ రింగ్ రోడ్డు, హైటెక్ సిటీ, మెట్రో రైలు, పీవీ నరసింహా రావు బ్రిడ్జిని కట్టించింది కాంగ్రెస్సే. కృష్ణా-గోదావరి నదీ జలాలను హైదరాబాద్‌‌కు కాంగ్రెస్ పార్టీనే తరలించింది. ఐటీ, ఫార్మా కంపెనీలను కాంగ్రెస్సే రప్పించింది. ఉప్పల్ స్టేడియాన్ని కట్టించింది కూడా కాంగ్రెస్ పార్టీనే. ఇలాంటి అభివృద్ధి చెందిన ధనిక రాష్ట్రాన్ని టీఆర్ఎస్ దివాళా తీయించింది. మత విద్వేషాలతో రెచ్చగొడుతున్న టీఆర్ఎస్-బీజేపీని ప్రజలు ఓడించాలి’ అని రేవంత్ పేర్కొన్నారు.