జోడో యాత్రలో విషాదం..గుండపోటుతో ఎంపీ మృతి

జోడో యాత్రలో విషాదం..గుండపోటుతో ఎంపీ మృతి

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో విషాదం చోటుచేసుకుంది. కాంగ్రెస్ ఎంపీ సంతోక్ సింగ్ చౌదరి గుండెపోటుతో కన్నుమూశారు. పంజాబ్ ఫిల్లౌర్ వద్ద జోడో యాత్రలో పాల్గొన్న ఎంపీ సంతోక్ సింగ్.. ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలారు. వెంటనే అంబులెన్సులో ఆస్పత్రికి తరలించినప్పటికీ... ఆయన తుదిశ్వాస విడిచినట్టు అధికారులు ధ్రువీకరించారు. దీంతో రాహుల్ గాంధీ పాదయాత్రను ఆపేసి ఆసుపత్రికి చేరుకున్నారు.

1946 జూన్‌ 18న జలంధర్‌లోని ధలివాల్‌ ప్రాంతంలో సంతోక్ సింగ్ జన్మించారు. పంజాబ్‌లో కాంగ్రెస్‌ హయాంలో కేబినెట్‌ మంత్రిగా పనిచేశారు. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో జలంధర్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి వరుసగా రెండు సార్లు విజయం సాధించారు.

కాంగ్రెస్ ఎంపీ సంతోక్ సింగ్ చౌదరి మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సంతోక్ సింగ్ కి సంతాపం ప్రకటిస్తూ, ట్వీట్ చేశారు.