మోదీ పరివారమంతా క్రిమినల్సే : అల్కా లాంబా

మోదీ పరివారమంతా క్రిమినల్సే : అల్కా లాంబా

హైదరాబాద్, వెలుగు: మోదీ పరివార్ లో క్రిమినల్స్ ఉన్నారని.. ఇందులో అదానీ, అంబానీ గత పదేండ్లుగా దేశ సంపదను దోచుకున్నారని మహిళా కాంగ్రెస్ నేషనల్ ప్రెసిడెంట్ అల్కా లాంబా ఆరోపించారు. జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ వందల మంది మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడ్డాడని.. వారి వీడియోలను కూడా చిత్రీకరించడం సిగ్గుచేటన్నారు. ఆయన గెలుపు కోసం ప్రధాన మంత్రి మోదీ ఎన్నికల ప్రచారం చేయటం దుర్మార్గమైన చర్య అని ఆమె అన్నారు. 

గురువారం గాంధీ భవన్ లో ఏఐసీసీ అధికార ప్రతినిధి సుజాతా పాల్, మహిళ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతరావులతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. అంతకుముందు మోదీకా పరివార్ పేరుతో తయారు చేసిన పోస్టర్ ను నేతలు విడుదల చేశారు. మహిళా సాధికారిత కాంగ్రెస్ తోనే సాధ్యమని, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కోసం 500 రూపాయలకు గ్యాస్, ఉచిత బస్సు.. వంటి స్కీములు అమలు చేస్తున్నదని, కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళాభివృద్ధి కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని అన్నారు.