అక్టోబర్ 31న కొల్లాపూర్​కు ప్రియాంక గాంధీ

అక్టోబర్ 31న కొల్లాపూర్​కు ప్రియాంక గాంధీ

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: ఈ నెల 31న కొల్లాపూర్ కు ఏఐసీసీ నేత ప్రియాంక గాంధీ వస్తున్నట్లు కాంగ్రెస్  పార్లమెంట్​ ఇన్​చార్జి పీవీ మోహన్, డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణ తెలిపారు. శుక్రవారం కాంగ్రెస్​ ఆఫీస్​లో మీడియాతో మాట్లాడుతూ కొల్లాపూర్ లో నిర్వహించే పాలమూరు ప్రజాభేరి సభకు 2 లక్షల మందిని తరలిస్తున్నట్లు తెలిపారు.

పార్లమెంట్​లోని ఏడు స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రియల్​ ఎస్టేట్​ వ్యాపారం చేస్తోందని విమర్శించారు. బీఆర్ఎస్​ నేతలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. జడ్పీటీసీలు రోహిణి, సుమిత్ర, హబీబ్, శ్రీనివాస్  పాల్గొన్నారు.