హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్పార్టీ బీసీ డిక్లరేషన్కమిటీ, అడ్వైజరీ కమిటీలను ఏర్పాటు చేసింది. డిక్లరేషన్ కమిటీకి చైర్మన్గా పొన్నం ప్రభాకర్ను నియమిస్తూ రేవంత్ రెడ్డి బుధవారం ఆదేశాలు జారీ చేశారు. కో చైర్మన్లుగా నూతి శ్రీకాంత్, ఎర్ర శేఖర్, ఈరవర్తి అనిల్నేత, జెరిపాతి జైపాల్, గాలి అనిల్ కుమార్, తోటకూర వజ్రేశ్యాదవ్లను నియమించారు. అడ్వైజరీ కమిటీ చీఫ్పాట్రన్లుగా వీహెచ్, పొన్నాల లక్ష్మయ్యను నియమించారు. మధుయాష్కీ, మహేశ్కుమార్ గౌడ్, అంజన్కుమార్ యాదవ్, కొండా సురేఖ, సురేశ్ షెట్కార్, కత్తి వెంకటస్వామి, సంగిశెట్టి జగదీశ్వర్రావు అడ్వైజర్లుగా ఉండనున్నారు. వారితో పాటు మెట్టు సాయి, కేతూరి వెంకటేశ్ సహా 37 మందిని అడ్వైజరీ కమిటీలో సభ్యులుగా చేర్చారు.త్వరలో షాద్నగర్లో నిర్వహించనున్న బీసీ డిక్లరేషన్ సభ కో ఆర్డినేటర్గా వీర్లపల్లి శంకర్కు బాధ్యతలు అప్పగించారు.
