టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పిలుపుమేరకు సీఎం కేసీఆర్ 9 ఏళ్ల పాలనపై దశాబ్ది దగా పేరుతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్లోని ఆ పార్టీ కార్యాలయం వద్ద సీఎం కేసీఆర్తోకూడిన 10 తలల దిష్టి బొమ్మను నేతలు దహనం చేశారు. బీఆర్ఎస్ సర్కార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, కార్యకర్తలకు తోపులాటలు జరిగాయి. ఇరువర్గాలు వాగ్వాదానికి దిగారు. దీంతో ఆయా ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ముందస్తు అరెస్టులు..
నిరసనల విషయం తెలుసుకున్న పోలీసులు కాంగ్రెస్ సీనియర్నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. వారిలో షబ్బీర్అలీ, తదితరులు ఉన్నారు. నేతల హౌస్ అరెస్టులను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, కోమటి రెడ్డి వెంకటి రెడ్డి ఖండిచారు. ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలపడం ఒక భాగమని వారు అన్నారు. కేసీఆర్ పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని విమర్శించారు.