వివేక్​ సమక్షంలో  బీజేపీలోకి కాంగ్రెస్​ కార్యకర్తలు

వివేక్​ సమక్షంలో  బీజేపీలోకి కాంగ్రెస్​ కార్యకర్తలు

హైదరాబాద్, వెలుగు: కర్నాటకలోని  కుష్టగి నియోజకవర్గంలో కాంగ్రెస్​కు చెందిన పలువురు కార్యకర్తలు గురువారం బీజేపీలో చేరారు. నియోజకవర్గ ఇన్​చార్జి వివేక్ వెంకటస్వామి వారికి  పార్టీ కండువాలు కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో  బీజేపీ  ఎమ్మెల్యే అభ్యర్థి దొడ్డనగౌడ హనుమగౌడ పాటిల్  పాల్గొన్నారు.

వివేక్​ను మహిళా మోర్చా అధ్యక్షురాలు పరిమళ షెట్టర్ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం బీజేపీ శక్తి కేంద్రాల ప్రముఖులతో వివేక్ సమావేశమయ్యారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ  స్కీమ్​ల గురించి ప్రజలకు చెప్పాలని సూచించారు.