నోటీసు మాకివ్వకుండా టీవీ చానళ్లకు ఎట్లిస్తరు?

నోటీసు మాకివ్వకుండా  టీవీ చానళ్లకు ఎట్లిస్తరు?
  • రివ్యూ చేయాలని సీఈవోను కోరిన రాష్ట్ర కాంగ్రెస్ 

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్​ పార్టీ ప్రచారానికి రిలీజ్​ చేసిన వీడియోలు ఏవీ  మార్చలేదని, మిస్​యూజ్​ కూడా చేయలేదని ఆ పార్టీ స్పష్టం చేసింది. కాంగ్రెస్ యాడ్స్​ నిలిపివేయడంపై ముందుగా తమకు నోటీసు ఇవ్వకుండా, టీవీలకు ఇవ్వడం ఏంటని ప్రశ్నించింది. సోమవారం ఈ మేరకు సీఈవో వికాస్​రాజ్​ను ఏఐసీసీ అధికార ప్రతినిధి అజయ్, పీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ మహేశ్​ కుమార్​ గౌడ్​ కలిశారు. 

తమ పార్టీ మీడియా సర్టిఫికేషన్ అండ్​ మానిటరింగ్​ కమిటీకి ఇచ్చిన వీడియోలు.. టీవీల్లో ప్లే అవుతున్నవి రెండూ పక్కపక్కన పెట్టి చూడాలని సీఈవోను కోరారు. తమకు అనుమతి వచ్చిన యాడ్స్​ ఎలా ఉన్నాయో.. వాటినే టీవీల్లో, సోషల్​ మీడియాల్లో ప్లే చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈసీఐ నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటున్న తమకు సంబంధించిన యాడ్స్ ఆపేయడంపై రివ్యూ చేయాలని కోరినట్లు మీడియాకు తెలిపారు. 

మమ్మల్ని వివరణ కూడా అడగలే: అజయ్

తమ పార్టీకి చెందిన 4 యాడ్స్​ ఆపాలన్న విషయాన్ని తమకు చెప్పడాని కంటే ముందే టీవీలు, సోషల్​ మీడియా చానళ్ల ఎడిటర్లకు లెటర్లు పంపారని, తమ నుంచి వివరణ కూడా తీసుకోలేదని అజయ్ అన్నారు. తాము ప్రచారం చేసే ప్రతి యాడ్ ఎంసీఎంసీ అనుమతి తీసుకున్నామని స్పష్టం చేశారు.  రాష్ట్రంలో పోలీసులు బీఆర్​ఎస్​కు అనుకూలంగా పనిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. 

ALSO READ : గ్రాసిమ్‌‌ ప్రాఫిట్‌‌ రూ.1,164 కోట్లు

పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్​ మహేశ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకుంటున్న ప్రకటనలు అభ్యంతరకరంగా ఉంటే తమకే నోటీసు ఇవ్వాలి కానీ, యాడ్స్ ప్రసారం అవుతున్న టీవీ చానళ్లకు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. దీనిపై రివ్యూ చేస్తామని సీఈవో చెప్పినట్లు తెలిపారు.