జూరాలపై బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేతలది తప్పుడు ప్రచారం

జూరాలపై బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేతలది తప్పుడు ప్రచారం
  • 10 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చినా ఇబ్బందేమీ లేదు
  • కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మధుసూదన్ రెడ్డి, మేఘా రెడ్డి

హైదరాబాద్, వెలుగు: జూరాల ప్రాజెక్టు కూలిపోతుందని బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మధుసూదన్ రెడ్డి, మేఘా రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం సీఎల్పీలో వారు మీడియాతో మాట్లాడారు. ఇలాంటి అసత్యాలను ప్రచారం చేయడం వల్లే గత ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోయిందని, ఇంకా వారికి బుద్ధి రాలేదని ఫైర్ అయ్యారు. జూరాల కట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వమని, మరో 30 ఏండ్లయినా ఆ ప్రాజెక్టుకు ఢోకా లేదన్నారు. 10 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా.. ఈ ప్రాజెక్టుకు ఎలాంటి ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు.

ప్రాజెక్టుకు చెందిన 62 గేట్లు పని చేస్తున్నాయని, 8 గేట్లు మరమ్మత్తులు చేయాల్సి ఉండగా, అందులో నాలుగు పూర్తయ్యాయని, మిగిలిన 4 గేట్ల రోప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు మార్చాల్సి ఉందని చెప్పారు. తాగు నీటి కోసం ఏడాది పొడవునా ఈ ప్రాజెక్టులో నీరు నిల్వ ఉంచడం వల్ల మరమ్మత్తులకు ఇబ్బంది అవుతోందని తెలిపారు. ట్విట్టర్ టిల్లు కేటీఆర్ జూరాల ప్రాజెక్టు కూలిపోతుందని ట్వీట్లు చేస్తూ హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలు కడుపులో కత్తులు పెట్టుకొని కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై విషం చిమ్ముతున్నారని దుయ్యబట్టారు.