బషీర్బాగ్, వెలుగు: రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హరిస్తున్నదని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీత రావు , ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు మోతె రోహిత్ ఆరోపించారు. ఓట్ చోరీపై గన్ ఫౌండ్రి మాజీ కార్పొరేటర్ మమత సంతోష్ గుప్త ఆధ్వర్యంలో కోఠి ఆంధ్రాబ్యాంక్ చౌరస్తాలో చేపట్టిన సిగ్నేచర్ క్యాంపెయిన్లో వారు పాల్గొన్నారు. ప్రజలకు బీజేపీ చేస్తున్న మోసాలను వివరించి సంతకాలు సేకరించారు.
దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజలంతా కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఇటీవల హర్యానా, మహారాష్ట్ర, బీహార్ ఎన్నికల్లో ఈసీతో బీజేపీ కుమ్మక్కై గెలిచిందని ఆరోపించారు. ప్రజలు జాగ్రత్తగా లేకపోతే దేశమంతా ఇదే తరహా ఎన్నికలు జరుగుతాయని హెచ్చరించారు. సేకరించిన సంతకాలను రాష్ట్రపతికి పంపిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సంతోష్ గుప్త, శశి భూషణ్ తదితరులు పాల్గొన్నారు.
