రామప్ప ఆలయం నుంచి కాంగ్రెస్‌ విజయభేరి యాత్ర ప్రారంభం

రామప్ప ఆలయం నుంచి కాంగ్రెస్‌  విజయభేరి యాత్ర ప్రారంభం

తెలంగాణలో కాంగ్రెస్‌ విజయభేరి యాత్ర ప్రారంభం అయింది.  రామప్ప ఆలయం నుంచి విజయభేరి యాత్ర ప్రారంభమైంది.   రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ  కలిసి ఈ యాత్రను ప్రారంభించారు.  రామప్ప ఆలయం నుంచి ములుగు వరకు బస్సు యాత్ర కొనసాగనుంది.  ఈ యాత్రలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే సీతక్క ఇతర నేతలు పాల్గొన్నారు.  

అనంతరం ములుగులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో  రాహుల్, ప్రియాంక పాల్గొని ప్రసగించనున్నారు.  ఈ సభలోనే  ప్రియాంక కాంగ్రెస్ మహిళా డిక్లరేషన్ ను ప్రకటించనున్నారు.   అంతకుముందు  రాహుల్‌ , ప్రియాంక రామప్ప ఆలయంలో పూజలు నిర్వహించారు.  ఆరు గ్యారంటీల కార్డుకు పూజలు నిర్వహించారు.