బీఆర్ఎస్​ కౌన్సిలర్​ ఇంటి ముందు కాంగ్రెస్​ ఆందోళన

బీఆర్ఎస్​ కౌన్సిలర్​ ఇంటి ముందు కాంగ్రెస్​ ఆందోళన

మెదక్, వెలుగు : స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్​రావుపై అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్​ శ్రేణులు బుధవారం రాత్రి బీఆర్ఎస్​కు చెందిన 5వ వార్డు కౌన్సిలర్​ మామిళ్ల ఆంజనేయులు ఇంటి ముందు ఆందోళనకు దిగారు. మెదక్​లో మంగళవారం జరిగిన బీఆర్ఎస్​ కార్యకర్తల సమావేశంలో  ఆంజనేయులు ఎమ్మెల్యే రోహిత్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్​రావులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని

బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేశారు. విషయం తెలియడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనను విరమింపజేసే ప్రయత్నం చేశారు. అయినా కాంగ్రెస్​ కార్యకర్తలు కదలమని భీష్మించారు. పోలీసులు సముదాయించడంతో గురువారం ఉదయం వరకు క్షమాపణ చెప్పకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఆందోళనలో కాంగ్రెస్​ లీడర్లు  జీవన్​ రావు, పవన్, తాహెర్, మీర్జా అలీబేగ్​ పాల్గొన్నారు.