చెక్పోస్ట్ ​వద్ద నడిరోడ్డుపై .. కరెంట్ షాక్​తో కానిస్టేబుల్ మృతి

చెక్పోస్ట్ ​వద్ద నడిరోడ్డుపై .. కరెంట్ షాక్​తో కానిస్టేబుల్ మృతి

జూబ్లీహిల్స్​ చెక్​పోస్ట్ ​వద్ద కరెంట్ షాక్​తో  గ్రే హౌండ్స్​ కానిస్టేబుల్​ఒకరు మృతి చెందారు. గండిపేట గ్రే హౌండ్స్​లో పనిచేసే వీరాస్వామి(45)  ఫ్యామిలీ తో కలిసి అక్కడి  ​క్వార్టర్స్​లో ఉంటున్నాడు. వీరా స్వామి తమ్ముడు యూసఫ్​గూడ  బెటాలియన్​లో పనిచేస్తున్నాడు.

ఆదివారం సాయంత్రం తమ్ముడిని కలిసేందుకు యూసుఫ్​గూడకు వచ్చిన వీరాస్వామి  తిరిగి రాత్రి బైక్​పై గండిపేటకు బయలుదేరాడు. జూబ్లీహిల్స్ చెక్​పోస్ట్ ​ఫ్రీ లెఫ్ట్​వద్దకు రాగానే  ఒక్కసారిగా ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది.

అతడి బైక్​ అదుపు తప్పడంతో ఫుట్​పాత్​పై పడిపోయి.. పక్కనే ఉన్న కరెంట్ స్తంభాన్ని తాకాడు. కరెంట్​ షాక్​ తగలడంతో పోలీసులు వెంటనే అతడిని అంబులెన్స్​లో జూబ్లీహిల్స్ ​అపోలోకు తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు.