సికింద్రాబాద్ పరిధిలో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. బేగంపేటలోని చికోటి గార్డెన్ వద్ద తుఫాకితో కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని చనిపోయాడు.
మృతుడు ఛత్తీస్గఢ్ కు చెందిన దేవేందర్ గా పోలీసులు గుర్తించారు. సీఆర్పీఎఫ్ ఐజీ మహేశ్చంద్ర వద్ద దేవేందర్ విధులు నిర్వహిస్తున్నారు. కానిస్టేబుల్ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని బేగంపేట పోలీసులు అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం జవాను మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.