ప్రతి ఒక్కరికి ఇల్లు రాజ్యంగ హక్కు ..రాష్ట్ర కన్వీనర్ ఎస్​. వీరయ్య

ప్రతి ఒక్కరికి ఇల్లు రాజ్యంగ హక్కు ..రాష్ట్ర కన్వీనర్ ఎస్​. వీరయ్య

సంగారెడ్డి టౌన్, వెలుగు:  దేశంలో ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు  ఉండటం రాజ్యాంగం కల్పించిన హక్కని  ప్రజాసంఘాల పోరాట వేదిక రాష్ట్ర కన్వీనర్ వీరయ్య అన్నారు.   ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బస్సు యాత్ర ఆదివారం సంగారెడ్డికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో  మాట్లాడారు. పేదల  ఇండ్ల స్థలాలపై ఈనెల 27 వరకల్లా   ముఖ్యమంత్రి ప్రకటన చేయాలని,  లేకుండా  ఉద్యమిస్తామని హెచ్చరించారు. 

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలోని రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల మందికి ఇంటి సౌకర్యం లేదని , డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తి చేసి పేదల సొంతింటి కల నెరవేరుస్తామని ఎన్నికల హామీని విస్మరించిందన్నారు.   రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాల జీవోలను సవరించకుండా కాలయాపన చేసిందని విమర్శించారు.     ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కారాములు,  రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి, నాయకులు వెంకట రాములు, సాగర్, స్కైలాబ్ బాబు సాయిలు మల్లేశం, అశోక్ ,మాణిక్యం ,నర్సింలు, రాజయ్య పాల్గొన్నారు.