
వికారాబాద్, వెలుగు: రైతుల నుంచి కొన్న వడ్లను వెంటనే బియ్యంగా మార్చి ప్రభుత్వానికి అందజేయాలని వికారాబాద్ అడిషనల్ కలెక్టర్ లింగ్యా నాయక్ మిల్లర్లను ఆదేశించారు. శుక్రవారం జిల్లాలోని బాయిల్డ్, రా రైస్ మిల్లర్లతో సమావేశమయ్యారు. 2024- – 25 వానకాలం సీజన్లో 8,769 మెట్రిక్ టన్నుల సన్నధాన్యం రైతుల నుంచి కొన్నామని చెప్పారు. వీటిని రైస్ గా మార్చి ప్రభుత్వానికి ఇస్తే రేషన్ లబ్ధిదారులకు పంపిణీ చేస్తామన్నారు.