దేశంలో రెండోసారి 83 వేలు దాటిన కరోనా కేసులు

దేశంలో రెండోసారి 83 వేలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు రోజురోజూకూ పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా గురువారం కూడా రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. గ‌త 24 గంట‌ల్లో 83,341 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయని కేంద్ర కుటుంబ మరియు సంక్షేమ శాఖ తెలిపింది. ఇంత భారీ మొత్తంలో పాజిటివ్ కేసులు నమోదుకావడం ఇదే రెండోసారి. గురువారం కూడా దేశంలో 83,883 కేసులు నమోదయ్యాయి. శుక్రవారం నాటి కేసులతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 39 లక్షలు దాటింది. కొత్త కేసులతో కలిపి ఇప్పటివరకు దేశంలో నమోదయిన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 39,36,748కి చేరింది. ఇందులో 8,31,124 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు కరోనా బారినపడి కోలుకున్న వారిసంఖ్య 30,37,152గా ఉంది. గురువారం దేశవ్యాప్తంగా 1096 మంది కరోనాతో మ‌రణించారు. దాంతో దేశంలో మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 68,472కు చేరినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

గురువారం దేశవ్యాప్తంగా 11,69,765 మందికి కరోనా టెస్టులు చేసినట్లు ఐసీఎంఆర్ ప్రకటించింది. దాంతో ఇప్పటివరకు దేశంలో 4,66,79,145 టెస్టులు చేసినట్లు తెలిపింది.

For More News..

రియా చక్రవర్తి ఇంట్లో యాంటీ డ్రగ్ అధికారుల సోదాలు

తెలంగాణలో మరో 2,478 కరోనా కేసులు

బోల్తా పడి నుజ్జునుజ్జయిన కారు.. స్పాట్‌లోనే అయిదుగురు మృతి