జగిత్యాల జిల్లాలో 9 మంది విద్యార్థులకు కరోనా

జగిత్యాల జిల్లాలో 9 మంది విద్యార్థులకు కరోనా

జగిత్యాల జిల్లాలో మరోసారి కరోనా కలకలం రేపుతోంది. మల్యాల మండలం తాటిపెళ్లి గురుకుల స్కూల్ లో తొమ్మిది మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఒకే స్కూల్ లో 9మంది పిల్లలకు కరోనా రావడంపై.. మిగతా విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అయితే తరగతి గదులను ఎప్పటికప్పుడు సానిటైజ్ చేస్తున్నామని స్కూల్ నిర్వాహకులు చెబుతున్నారు. మిగతా విద్యార్థులకు కూడా కరోనా టెస్టులు చేస్తున్నారు. 

కాగా.. జగిత్యాల పట్టణంలోని కృష్ణానగర్ లో ఓ ప్రైవేటు స్కూల్ లో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థికి కరోనా సోకింది. దీంతో ఏడో తరగతిని స్కూల్ నిర్వాహకులు బంద్ పెట్టారు. మిగతా తరగతులను యదావిధిగా నిర్వహిస్తున్నారు. దాంతో విద్యార్థుల తల్లిదండ్రులు భయపడుతున్నారు.