ఒకే పోలీస్ స్టేషన్ లో ఒకే రోజు 18 మందికి కరోనా

ఒకే పోలీస్ స్టేషన్ లో ఒకే రోజు 18 మందికి కరోనా

కరీంనగర్ క్రైం  వెలుగు: కరీంనగర్ వన్టౌన్ పోలీస్ స్టేషన్లో  పని చేస్తున్న 18మంది పోలీసులకు కరోనా వైరస్ సోకింది. వీరిలో ఒక సీఐ, ఎస్సైతో పాటు కానిస్టేబుల్స్ ఉన్నారు. వీరిలో కొందరు ఆస్పత్రుల్లో చేరి చికిత్స పొందుతుండగా మరికొందరు హోం క్వారంటైన్లో ఉన్నారు. 60 మంది సిబ్బందిలో ఒక్కసారిగా 18 మందికి పాజిటివ్ గా తేలడంతో స్టేషన్లో సేవలకు ఇబ్బందులు కలగకుండా కమిషరేట్లో వివిధ హోదాల్లో డ్యూటీ చేస్తున్న రిజర్వ్ లో ఉన్న అధికారులను తాత్కాలికంగా ఇక్కడ నియమించారు. సీపీ ఆదేశాల మేరకు మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ దామోదర్రెడ్డి వన్టౌన్ ఇన్చార్జి ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. స్టేషన్లో పనిచేస్తున్న మిగతా సిబ్బంది వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని సీపీ కమలాసన్ రెడ్డి ఆదేశించారు. పోలీసులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మెరుగైన ట్రీట్ మెంట్ అందిస్తామని సీపీ తెలిపారు. గురువారం వన్టౌన్ పోలీస్స్టేషన్ సందర్శించి పోలీసులకు భరోసా కల్పించారు.