తిమ్మాపూర్, వెలుగు: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని అలుగునూర్ శివారులో ఉన్న గురుకుల కాలేజీలో 56 మంది ఇంటర్ స్టూడెంట్లకు కరోనా సోకింది. ఈ విషయమై ప్రిన్సిపల్ సమ్మయ్య మాట్లాడుతూ ఇళ్లలో సౌకర్యాలు లేవన్న తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు గత నెల 21 నుంచి దూరప్రాంతాల స్టూడెంట్లకు క్లాసులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నాగర్ కర్నూల్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, ఖమ్మంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 226 మంది ప్రస్తుతం కాలేజీలో ఉన్నారన్నారు. ఓ స్టూడెంట్ విషయంలో అనుమానం రావడంతో శనివారం టెస్టులు చేయించామన్నారు. మొత్తం 56 మందికి కరోనా సోకినట్లు తేలిందన్నారు. పాజిటివ్ వచ్చినవారిని కాలేజీ కాంపౌండ్ లోనే ఉంచి ట్రీట్మెంట్ అందించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. మిగతా స్టూడెంట్ల రిపోర్ట్ రావాల్సి ఉందన్నారు.
For More News..