ముగ్గురు టీచర్లకు కరోనా.. ఆందోళనలో పేరెంట్స్​

ముగ్గురు టీచర్లకు కరోనా.. ఆందోళనలో పేరెంట్స్​

ఏటూరునాగారం/మహా ముత్తారం, వెలుగు: గవర్నమెంట్ స్కూల్స్ ప్రారంభమైన రెండో రోజే భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ముగ్గురు స్కూల్ టీచర్లకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఏటూరునాగారం జడ్పీ స్కూల్​కు మొదటి రోజు 120 మంది, రెండో  రోజు 210 మంది స్టూడెంట్లు హాజరయ్యారు. రెండు రోజులుగా క్లాస్​లు తీసుకుంటున్న ఇద్దరు టీచర్లకు స్వల్పంగా కరోనా లక్షణాలు కనపడడంతో గురువారం టెస్టులు చేయించుకోగా పాజిటివ్​గా తేలింది. ఇద్దరు టీచర్లను హోం ఐసోలేషన్​కు పంపినట్లు ఎంఈవో చెప్పారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం మాదారం ప్రైమరీ స్కూల్ హెచ్ఎంకు జ్వరం రావడంతో పాటు వాసన, రుచి పోయింది. కరోనా టెస్ట్ చేయించగా పాజిటివ్ వచ్చింది.