- తనను పట్టించుకోలేదని బంధువులకు ఫోన్
- సోషల్ మీడియాలో ఆడియో క్లిప్ వైరల్
పద్మారావునగర్, వెలుగు: నిన్నటికినిన్న కరోనాతో చనిపోయినామె డెడ్బాడీని ఆరుగంటల పాటు బెడ్పైనే ఉంచారు. ఆ ఘటన మరువకముందే గాంధీలో మరో దారుణం జరిగింది. బుధవారం ఉదయం టైంకు ఆక్సిజన్ అందక కరోనా పేషెంట్ చనిపోయాడు. హైదరాబాద్లోని సైనిక్పురి కాకతీయనగర్కు చెందిన శ్రీధర్ (32) అనే వ్యక్తి నాలుగు రోజులుగా శ్వాస సమస్యలతో బాధపడుతున్నాడు. దీంతో రెండ్రోజుల కిందట అతడిని ఉస్మానియా ఆస్పత్రిలో చేర్చారు. కరోనా టెస్టుల్లో పాజిటివ్ తేలడంతో వెంటనే గాంధీకి తరలించారు. మంగళవారం రాత్రి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడ్డాడు. ఎవరూ పట్టించుకోలేదు. ఆక్సిజన్ పెట్టలేదు. దీంతో బుధవారం ఉదయం చనిపోయాడు. చనిపోయే ముందు బంధువులకు ఫోన్ చేసి జరిగింది చెప్పాడు. ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉందని, తనను ఎవరూ పట్టించుకోవట్లేదని బాధపడ్డాడు. ఆ ఆడియో క్లిప్లు సోషల్మీడియాలో వైరల్ అయ్యాయి. శ్రీధర్ స్వస్థలం కర్నూలు. భార్య, రెండేండ్ల బాబు ఉన్నాడు. మెకానిక్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఉస్మానియాలో రెండ్రోజులు ఆక్సిజన్తో తన భర్త బతికాడని.. అక్కడి వైద్యులే గాంధీకి పంపించారని శ్రీధర్ భార్య స్వరూప ఆవేదన వ్యక్తం చేసింది. గాంధీలో ఆక్సిజన్ కొరత లేదని.. 2,600 మంది పేషెంట్లకు సరిపడా ఆక్సిజన్ ఉందని ఆస్పత్రి సూపరింటెండెంట్ వివరణ ఇచ్చారు.