మహారాష్ట్రలో మరో 351 మంది పోలీసులకు కరోనా పాజిటివ్

మహారాష్ట్రలో మరో 351 మంది పోలీసులకు కరోనా పాజిటివ్

మహారాష్ట్రలో కరోనా బారిన పడుతున్న పోలీసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ప్రతి రోజు వందలాది మంది పోలీసులకు కరోనా సోకుతుండగా.. మృతుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. నిన్నటి(సోమవారం) నుంచి మంగళవారం వరకు గత 24 గంటల్లో   రాష్ట్ర వ్యాప్తంగా 351 మంది పోలీసులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో కరోనా సోకిన పోలీసుల సంఖ్య 14,067కు చేరింది. మరోవైపు చికిత్స పొందుతూ గత 24 గంటల్లో ముగ్గురు పోలీసులు చనిపోయారు. ఇప్పటి వరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 142కు చేరింది.