స్కూల్ విద్యార్థికి కరోనా.. ఆందోళనలో మిగతా విద్యార్థులు

స్కూల్ విద్యార్థికి కరోనా.. ఆందోళనలో మిగతా విద్యార్థులు

కరీంనగర్ జిల్లాలో మరోసారి కరోనా కలకలం రేగింది. జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థికి కరోనా పాజిటివ్‌గా తేలింది. జలుబుతో బాధపడుతున్న విద్యార్థికి జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయడంతో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దాంతో పాఠశాలలోని విద్యార్థులు, తల్లిదండ్రులు, మరియు ఉపాధ్యాయులు భయాందోళనకు గురవుతున్నారు. విద్యార్థికి కరోనా సోకడంతో పాఠశాలలోని మిగతా విద్యార్థులందరికి కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు.