
ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని సీఎం స్వయంగా శుక్రవారం ట్విట్టర్ ద్వారా తెలిపారు. కోవిడ్-19 పరీక్ష చేయించుకోగా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం నాకు కరోనా లక్షణాలేవి లేవని.. ఆరోగ్యంగానే ఉన్నానని తెలిపారు. డాక్టర్ల సలహా ప్రకారం హోం ఐసోలేషన్లో ఉన్నట్లు చెప్పారు. ఇటీవల తనను కలిసేందుకు వచ్చిన వారందరూ కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకొని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కొంతకాలం ఇంటి నుంచే పాలనా సంబంధమైన విషయాలను చక్కబెట్టనున్నట్లు సీఎం రావత్ స్పష్టం చేశారు.