మురళీ మోహన్ కుమారుడి ఇంట్లో కరోనా పాజిటివ్

మురళీ మోహన్ కుమారుడి ఇంట్లో కరోనా పాజిటివ్

హైదరాబాద్ లో సీనియర్ నటుడు  మురళీ మోహన్ కుమారుడి ఇంట్లో పని చేస్తున్న ముగ్గురు పని మనుషులకు కరోనా వైరస్ పాజిటివ్ గా తేలింది. వీరిలో ఇద్దరు భార్యా భర్తలున్నట్లుగా తెలుస్తోంది. మరో మహిళ వంట మనిషిగా పని చేస్తోంది. ఈ ముగ్గురిలో ఒకరికి కరోనా లక్షణాలు కనిపించడంతో ముందు ఆ వ్యక్తికి పరీక్షలు నిర్వహించారు. పాజిటివ్ గా  తేలడంతో మిగతా ఇద్దరినీ పరీక్షలకు పంపారు. వారికి కూడా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఈ క్రమంలో మురళీ మోహన్ కుమారుడు  కుటుంబ సభ్యులకు కూడా పరీక్షలు నిర్వహించే అవకాశమున్నట్లు సమాచారం.