సూర్య‌పేట జిల్లాలో చ‌నిపోయిన వ్య‌క్తికి క‌రోనా

సూర్య‌పేట జిల్లాలో చ‌నిపోయిన వ్య‌క్తికి క‌రోనా

సూర్య‌పేట జిల్లా: చ‌నిపోయిన వ్య‌క్త‌కి క‌రోనా పాజిటివ్ అని తేల‌డంతో బంధువులు, గ్రామ‌స్థులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. సూర్య‌పేట జిల్లా మున‌గాల‌లో శుక్ర‌వారం చ‌నిపోయిన ఓ వ్య‌క్తికి క‌రోనా పాజిటివ్ అని శ‌నివారం తెలిపారు అధికారులు. ఈ విష‌యంపై జిల్లా వైద్య ఆరోగ్య‌శాఖ అధికారి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ శ‌నివారం ధృవీక‌రించారు. దీంతో మృతుడి కుటుంబ స‌భ్యుల‌ను హోం క్వాంర‌టైన్ లో ఉండాల‌ని అధికారులు సూచించారు. వ్య‌క్తి మృతికి సంబంధించి ద‌హ‌న సంస్కారాల‌లో పాల్గొన్న వారంద‌రికీ .. ప‌లు సూచ‌న‌లు చేశారు అధికారులు.