- దేశంలోనే తొలిసారిగా ‘మెడిసిన్స్ ఫ్రమ్ ది స్కై’.. 11న వికారాబాద్లో షురూ
- రాష్ట్ర మంత్రులతో కలిసి ప్రారంభించనున్న కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా
- ప్రయోగాత్మకంగా ఐదు పీహెచ్సీలకు పంపిణీ
వికారాబాద్, వెలుగు: దేశంలోనే మొదటిసారిగా వికారాబాద్ జిల్లాలో డ్రోన్ ద్వారా మెడిసిన్స్ (మెడిసిన్ ఫ్రమ్ ది స్కై) పంపే ప్రాజెక్టు స్టార్ట్ కాబోతున్నది. ఈ నెల11న కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా రాష్ట్ర మంత్రులు కేటీఆర్, సబితా రెడ్డితో కలిసి ప్రారంభించనున్నారు. ప్రయోగాత్మకంగా మొదటగా ఐదు పీహెచ్సీలకు డ్రోన్ ద్వారా వ్యాక్సిన్లు పంపించనున్నారు. డ్రోన్ 400 ఫీట్ల ఎత్తులో ఎగురుతూ..10 నుంచి 25 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. 50 నుంచి100 కిలోల బరువు మోయగలదు. ఎదురుగా గుట్టలు, విమానాలు వస్తే సెన్సార్ సిస్టమ్తో పక్కకు తప్పుకుంటుంది. జిల్లా కేంద్రం నుంచి మెడిసిన్స్, వ్యాక్సిన్లుఅన్ని పీహెచ్సీలకు అందించాలని నిర్ణయించారు. జిల్లా కలెక్టర్ నిఖిల ప్రాజెక్టు ప్రారంభం, కేంద్ర మంత్రి పర్యటన ఏర్పాట్లపై అన్ని శాఖల అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు.