ఇండియాలో కరోనా తొలి మరణం

ఇండియాలో కరోనా తొలి మరణం

దేశంలో తొలి కొవిడ్ మరణం నమోదైంది. కర్నాటకలోని గుల్బర్గాకు చెందిన 76 ఏళ్ల వ్యక్తి వైరస్‌కు బలయ్యాడు. కరోనాతో చనిపోయాడన్న అనుమానంతో అతడి శాంపిళ్లను టెస్టులకు పంపించారు. టెస్టుల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆ వ్యక్తి చనిపోయింది కరోనాతోనేనని కర్నాటక ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఆ వ్యక్తి ఇటీవలే సౌదీ నుంచి గుల్బర్గాకు వచ్చాడు. అనారోగ్యంతో
స్థానిక డాక్టర్ల వద్ద చూయించుకోగా.. వాళ్లు హైదరాబాద్‌కు పంపారు. మంగళవారం రాత్రి హైదరాబాద్ నుంచి గుల్బర్గాకు వస్తుండగా
చనిపోయాడని కర్నాటక హెల్త్​ కమిషనర్ తెలిపారు.