
- కార్పొరేషన్ల చైర్మన్ల మీటింగ్లో నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ప్రతిపక్షాల విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు నిర్ణయించారు. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ కార్పొరేషన్ చైర్మన్లతో మీటింగ్ నిర్వహించడం అభినందనీయమన్నారు. మంగళవారం ఫిల్మ్ నగర్ క్లబ్లో 22 మంది కార్పొరేషన్ చైర్మన్లు సమావేశమయ్యారు. ప్రభుత్వ పథకాల అమలు, పార్టీ బలోపేతం, కమ్యూనికేషన్ వ్యూహాలపై ఈ మీటింగ్లో చర్చించారు.
ఏఐసీసీ ఇన్చార్జి ఇచ్చిన గైడ్ లైన్స్కు అనుసరించి, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు పనిచేస్తామన్నారు. గాంధీ భవన్లో నిర్వహించే మీడియా సమావేశాల్లో రోజూ ఇద్దరు కార్పొరేషన్ చైర్మన్లకు మాట్లాడే అవకాశం కల్పించాలని తీర్మానించారు. చైర్మన్లకు నియోజకవర్గాల వారీగా ప్రోటోకాల్ను అమలు చేయాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు.