మానుకోటలో ఎమ్మెల్యేపై కౌన్సిలర్ల తిరుగుబాటు

మానుకోటలో ఎమ్మెల్యేపై కౌన్సిలర్ల తిరుగుబాటు

మహబూబాబాద్​ అర్బన్, వెలుగు : మహబూబాబాద్​ మున్సిపాలిటీ అభివృద్ధి పనుల నిధుల కేటాయింపులో ఎమ్మెల్యే శంకర్​నాయక్​ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని బీఆర్ఎస్​, కాంగ్రెస్​, సీపీఎం, సీపీఐ కౌన్సిలర్లు తిరుగుబాటు చేశారు. సోమవారం ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఈదులపూసపల్లిలో బీఆర్ఎస్​, కాంగ్రెస్​, సీపీఐ, సీపీఎం కౌన్సిలర్లు సమావేశం పెట్టుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక వైపు వార్డులకు రూ.కోటి రూపాయలు కేటాయించాలని కౌన్సిలర్లు అడుగుతుంటే , ఎమ్మెల్యే వార్డులతో  సంబంధం లేని వ్యక్తులతో కలిసి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు.

సీఎం కేసీఆర్​ మున్సిపాలిటీకి కేటాయించిన రూ.50 కోట్ల ఫండ్స్​ను..అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో పంచాల్సి ఉండగా ఎమ్మెల్యే ఒక్కడే ఈ నిధులను పనుల కోసం కేటాయిస్తున్నాడన్నారు. కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ వెన్నం లక్ష్మారెడ్డి, సీపీఐ ఫ్లోర్ లీడర్ అజయ్ సారథి రెడ్డి, సీపీఎం ఫ్లోర్ లీడర్ సర్ణపు సోమయ్య, బీఆర్​ఎస్​ కౌన్సిలర్ ఎడ్ల వేణు, బి.నీరజారెడ్డి, బుజ్జి వెంకన్న, బానోత్ హరిసింగ్, అరెంపుల విజయమ్మ, పోతు రాజు, కోడి నాగలక్ష్మి, బూక్యా శ్రీను, బూక్యా సునీత, రవికుమార్, తాళ్లపల్లి జగన్, నిమ్మల శ్రీను పాల్గొన్నారు.