బాసర ట్రిపుల్‌‌‌‌‌‌‌‌ ఐటీలో కొనసాగుతున్న కౌన్సెలింగ్‌‌‌‌‌‌‌‌

బాసర ట్రిపుల్‌‌‌‌‌‌‌‌ ఐటీలో కొనసాగుతున్న కౌన్సెలింగ్‌‌‌‌‌‌‌‌

భైంసా, వెలుగు: నిర్మల్‌‌‌‌‌‌‌‌ జిల్లా బాసర ట్రిపుల్‌‌‌‌‌‌‌‌ ఐటీలో స్టూడెంట్లకు కౌన్సెలింగ్‌‌‌‌‌‌‌‌ కొనసాగుతోంది. రెండో రోజైన మంగళవారం 500 మంది స్టూడెంట్లు హాజరుకావాల్సి ఉండగా 31 మంది గైర్హాజరయ్యారు. మొత్తం 1,500 మంది స్టూడెంట్లకు ఒక్కో రోజు 500 మంది చొప్పున మూడు రోజుల పాటు కౌన్సెలింగ్‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేశారు.

 చివరి రోజైన బుధవారం మరో 500 మంది స్టూడెండ్లకు కౌన్సెలింగ్‌‌‌‌‌‌‌‌ నిర్వహిస్తామని ఆఫీసర్లు తెలిపారు. కౌన్సెలింగ్‌‌‌‌‌‌‌‌కు రాని స్టూడెంట్ల సీట్లను వెయిటింగ్‌‌‌‌‌‌‌‌ లిస్ట్‌‌‌‌‌‌‌‌ నుంచి తీసుకుంటామని చెప్పారు. అడ్మిషన్‌‌‌‌‌‌‌‌ పొందిన స్టూడెంట్లకు ఆగస్ట్‌‌‌‌‌‌‌‌లో క్లాస్‌‌‌‌‌‌‌‌లు ప్రారంభం అవుతాయన్నారు.