కుల్సుంపురాలో రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్

కుల్సుంపురాలో రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్

మెహిదీపట్నం, వెలుగు: శాంతి భద్రతలకు ఇబ్బంది కలిగిస్తే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని కుల్సుంపురా అడిషనల్ డీసీపీ మహ్మద్ అష్పక్, ఏసీపీ మహ్మద్ జావేద్ హెచ్చరించారు. కుల్సుంపురా డివిజన్ పరిధిలోని రౌడీషీటర్లకు సోమవారం కౌన్సెలింగ్ ఇచ్చారు. 

ఈ సందర్భంగా డీసీపీ, ఏసీపీ మాట్లాడుతూ.. టప్పాచబుత్ర, గుడిమల్కాపూర్, కుల్సుంపురా పీఎస్​ల పరిధిలో సుమారు 60 మంది రౌడీషీటర్లు ఉన్నారన్నారు. వీరిపై ఎప్పటికప్పుడు నిఘా ఉంటుందన్నారు. ఇల్లీగల్ యాక్టివిటీస్ కు పాల్పడటం, లా అండ్ ఆర్డర్​కు విఘాతం కలిగిస్తే పీడీ యాక్ట్ పెట్టి జైలుకు తరలిస్తామన్నారు. కార్యక్రమంలో సీఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.