
హైదరాబాద్, వెలుగు: రియల్ఎస్టేట్ డెవెలపర్ కంట్రీస్ కాండోస్ దేశవ్యాప్తంగా 20 ప్రాజెక్టులను చేపట్టినట్టు ప్రకటించింది. తెలంగాణలోనే 10 ప్రాజెక్టులను చేపట్టామని, ఇవి యాదగిరిగుట్ట, జనగామ, వనపర్తి వంటి ప్రాంతాల్లో ఉన్నాయని తెలిపింది. ఒక్కో ప్లాంటు 150–300గజాల్లో ఉంటుందని పేర్కొంది.
వీటితోపాటు మరో ఐదారు నగరాల్లో ప్రాజెక్టులను చేపడుతున్నట్టు కంట్రీ క్లబ్ ఫౌండర్ రాజీవ్రెడ్డి చెప్పారు. చెన్నై, బెంగళూరు, జైపూర్వంటి నగరాల్లో ప్రాజెక్టులను నిర్మిస్తున్నామన్నారు.