ఢిల్లీలో కరోనా విజృంభణ.. ఒక్కరోజులో 472 కేసులు

ఢిల్లీలో కరోనా విజృంభణ.. ఒక్కరోజులో 472 కేసులు

న్యూఢిల్లీ: రోజురోజుకు ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 472 కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 8,470 కి చేరుకుంది. ఒక్కరోజులో ఇన్ని కేసులు నమోదు కావడం రికార్డు అని అక్కడి హెల్త్ డిపార్ట్ మెంట్ అధికారులు వెల్లడించారు. కిందటి వారంలో మే 7 న ఒక్క రోజులో 448 కేసులు నమోదయ్యాయని చెప్పారు. ఇప్పటివరకు కరోనావైరస్ ఇన్‌ఫెక్షన్ వల్ల మరణించిన వారి సంఖ్య 115 కి పెరిగిందని గురువారం విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో వెల్లడించారు.