దేశంలో మరో ఆరు ఒమిక్రాన్ కేసులు

దేశంలో మరో ఆరు ఒమిక్రాన్ కేసులు

దేశంలో కరోనా కొత్త  వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతున్నాయి. ఇవాళ మొదట గుజరాత్‌లో రెండు, మహారాష్ట్రలో ఒకటి చొప్పున ఒమిక్రాన్ వేరియంట్ కేసులను గుర్తించగా.. కొన్ని గంటల తర్వాత మళ్లీ మహారాష్ట్రలో మరో ఆరు కేసులు నమోదయ్యాయి. దీంతో శుక్రవారం సాయంత్రం వరకూ దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసులు 26 ఉండగా.. ప్రస్తుతం 32కు చేరాయి. ఇవాళ ఒక్క రోజే మహారాష్ట్రలో ఏడు ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా.. మొత్తం కేసులు 17కు చేరాయి. మహారాష్ట్రలో ఇవాళ పాజిటివ్ వచ్చిన వారిలో మూడేళ్ల చిన్నారి కూడా ఉన్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. దేశంలో ఇప్పటి వరకూ మహారాష్ట్రలో 17, రాజస్థాన్‌లో 9, గుజరాత్‌లో 3, కర్ణాటకలో 2, ఢిల్లీలో ఒకటి చొప్పున ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.