తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య పదివేలు దాటింది. బుధవారం ఒక్కరోజులోనే పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం 891 కరోనా కొత్త కేసులు నమోదైనట్లుగా హెల్త్ బులెటిన్లో పేర్కొన్నారు. ఇప్పటి వరకూ నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 10,444కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 5858గా ఉన్నాయి. గత 24 గంటల్లో 137 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకూ పూర్తిగా కోలుకొని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 4,361కు చేరింది. ఇక బుధవారం మరో ఐదుగురు వ్యక్తులు కరోనాకు బలి కాగా, మొత్తం సంఖ్య 225కి చేరింది.
బుధవారం నమోదైన 891 కేసుల్లో అత్యధికంగా జిహెచ్ఎంసీ పరిధిలోనే 719 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 86, మేడ్చల్లో 55 కేసులు నమోదయ్యాయి.
