ఢిల్లీలో 660 కేసులు.. 14 మరణాలు

ఢిల్లీలో 660 కేసులు.. 14 మరణాలు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు ఏమాత్రం తగ్గడం లేదు. రోజురోజుకు వైరస్ బారినపడిన వారి సంఖ్య పెరుగుతోంది. శుక్రవారం ఉదయం నాటికి కేసుల సంఖ్య 12,000 దాటింది. గడిచిన 24 గంటల్లో వైరస్ బారిన పడి16 మంది చనిపోవడంతో మృతుల సంఖ్య 208 కు పెరిగింది. ఒకే రోజులు 660 కొత్త కేసులు నమోదు కావడంతో రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 12,319కి చేరుకుంది. గురువారం వరుసగా మూడవ రోజు 500 కు పైగా కేసులు నమోదయ్యాయని శుక్రవారం విడుదల చేసిన బులిటెన్ లో ఢిల్లీ హెల్త్ డిపార్ట్ మెంట్ వెల్లడించింది. ఇప్పటివరకు 5,897 మంది కోలుకుని డిశ్చార్జి అయినట్లు ప్రకటించింది. అలాగే దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 6,088 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసులు 1.18 లక్షలకు చేరుకున్నాయి. మృతుల సంఖ్య 3,583కు పెరిగింది.