షాకింగ్ : చనిపోయిన తర్వాత కరోనా బయటపడింది..

షాకింగ్ : చనిపోయిన తర్వాత కరోనా బయటపడింది..

హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు చనిపోయారు.. చనిపోయిన తర్వాత.. వీరిద్దరికీ కరోనా పాజిటివ్ అని నిర్థారణ కావటం కలకలం రేపుతోంది. అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరిన వీళ్లిద్దరి వయస్సు.. ఒకరికి 60 ఏళ్లు.. మరొకరికి 42 ఏళ్లు. ఇతర అనారోగ్య సమస్యలతో చనిపోయారని.. అయితే వీరికి చనిపోయిన తర్వాత కరోనా పాజిటివ్ అని తేలినట్లు డాక్టర్లు వెల్లడించటం విశేషం. 

మరో ముగ్గురు కరోనాతో ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్నారని.. వారి ఆరోగ్యం నిలకడగా ఉందని వివరించారు. ఆస్పత్రిలో డ్యూటీ చేస్తున్న ఇద్దరు పీజీ మెడికోలకు కరోనా పాజిటివ్ అని పరీక్షల్లో రిపోర్ట్ వచ్చిందని.. వారిని ఐసోలేషన్ లో ఉంచినట్లు వెల్లడించారు.

ఇద్దరు వ్యక్తులకు చనిపోయిన తర్వాత కరోనా పాజిటివ్ అని నిర్థారణ కావటం ఏంటనే చర్చ నడుస్తుంది. ముందుగా పరీక్షలు చేయలేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.