
సినీ నటి రేణుదేశాయ్, ఆమె కొడుకు అకీరా నందన్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని ఆమె తన ఇన్ స్టాగ్రమ్ ద్వారా చెప్పారు. ‘అన్నిజాగ్రత్తలు తీసుకుని ఇంట్లోనే ఉన్నాం.న్యూ ఇయర్ వేడుకల సమయంలో కూడా ఇంట్లోనే ఉన్నాం. గతేడాది రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న. అఖిరాకు వ్యాక్సిన్ వేయిద్దామనుకున్నాం. ఈ లోపే కరోనా లక్షణాలు వచ్చాయి. కోవిడ్ టెస్టు చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం కరోనా నుంచి కోలుకుంటున్నాం. అందరు థర్డ్ వేవ్ ను సీరియస్ గా తీసుకోండి. మాస్క్ ధరించి జాగ్రత్తగా ఉండాలని’ రేణు పోస్ట్ చేశారు.